హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ 281 జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బంజారా సాంస్కృతిక సంబరాలు, మహాబోగ్ బందరో సేవాలాల్ మహరాజ్ జాతీయ పురస్కారం కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపీ బి.బి.పాటిల్ , శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి , హోమ్ మంత్రి మహమూద్ అలి, ఎక్సజ్ శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ , గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో గురుకుల విద్యా శాఖ సెక్రటరీ ప్రవీణ్ కుమార్, బంజారా సమాజ్ ప్రముఖ నాయకులు మాజీ ఎంపీ సీతారాం నాయక్ , తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ కమీషనర్ శంకర్ నాయక్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.