నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో భారతీయ జనతా గిరిజన మోర్చ జిల్లా అధ్యక్షులు నర్సింహ నాయక్ ఆధ్వర్యంలో సంత్ సేవలాల్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలలో ముఖ్య అతిథిగా నాగర్ కర్నూల్ జిల్లా బిజెపి అధ్యక్షులు కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ సోమశిల సిద్దేశ్వరం వంతెన,జాతీయ రహదారి సాధకులు నల్లమల టైగర్ ఎల్లేని సుధాకర్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లేని సుధాకర్ రావు మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహరాజ్, అహింస పాపమని, మత్తు, ధూమ పానం శాపం అని హితవు పలికి బంజారా జాతికే కాదు యావత్తు ఇతర కులాలకు ఆదర్శ పురుషుడని అన్నారు.
సేవాలాల్ మహరాజ్ ఆనాడు బంజార జాతి పరువు ప్రతిష్టల గురించి ముందుగానే ఊహించి అహింస సిద్ధాంతానికి పునాది వేసి ఆచరించి చూపారని ఎల్లేని తెలిపారు. ఆ క్రమంలో బ్రిటిష్, ముస్లీం పాలకుల మత ప్రచారం ద్వారా బంజారా సమాజం అనేక ఇబ్బందులకు గురి అయ్యిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లేనితో పాటు రాష్ట్ర గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు ధర్మ నాయక్, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల గిరిజన మోర్చా నర్సింహ నాయక్, మోహన్ నాయక్ జిల్లా,మండల,గిరిజన మోర్చా నాయకులు పాల్గొన్నారు.