బడి బయట ఉన్న విద్యార్థులను తిరిగి బడిలో చేర్పించే కార్యక్రమాన్ని శ్రీకాకుళం సమగ్ర శిక్ష ప్రభుత్వ పాఠశాల ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయులు, సి.ఆర్.పి లు వేగవంతం చేశారు.
శ్రీకాకుళం గ్రామీణ మండలం లో శుక్రవారం నాడు పలువురు విద్యార్ధులను గుర్తించారు. బడి మానేసి విద్యార్థుల వివరాలను సేకరించి వారిని తిరిగి వారిని బడిలో చేర్పిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష వ్యాయామ ఉపాధ్యాయులు జి మోహన్, కె నరేష్, శ్రీకాకుళం గ్రామీణ మండలంలో పాత్రునివలస స్కూల్ కాంప్లెక్స్ లో పనిచేస్తున్న సి. ఆర్. పి. పి.మోహన్, గాంధీనగర్ అంగన్వాడి సెంటర్ లో పనిచేస్తున్న అంగన్వాడీలు, తదితరులు పాల్గొన్నారు.