తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్ల మాన అభిమానులు మంటగలుస్తున్నాయని తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ అన్నారు.
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను మంగళవారం సందర్శించారు. పాఠశాల స్థితిగతులను పరిశీలించి శిథిలావస్థలో ఉన్న మూత్ర శాలలు చూసి ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్ల మాన అభిమానాల రక్షణ విషయంలో ప్రభుత్వమే నిర్లక్ష్యం చేయడం ఘోరాతి ఘోరమని, ప్రభుత్వమే ఈ విధంగా ఉంటే ఆడపిల్లలకు రక్షణ ఏంటి అని ప్రశ్నించారు. అధికార పార్టీ కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తాం అని చెప్పిన ఈ ప్రభుత్వం విద్యార్థినుల ఆత్మ గౌరవాన్ని కాపాడలేక పోతుందని ఆయన దుయ్యబట్టారు.
ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తుందని, నిధులను దారి మళ్లించి దుర్వినియోగం చేస్తుందని పేర్కొన్నారు. గతంలో అనేక మార్లు జిల్లా కలెక్టర్ కు, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి మెమోరాండం సమర్పించినట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం విద్యా శాఖ మంత్రి ఒక మహిళ అయి ఉంఢి కూడా విద్యార్థినుల ఆత్మ గౌరవాన్ని కాపాడ లేక పోతున్నారని, నేటికీ ఎలాంటి స్పందన లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా మంగళవారం ఆయన వినూత్న నిరసన చేపట్టారు.
అందులో భాగంగా గ్రామంలో బిక్షాటన చేశారు. బిక్షాటనలో వచ్చిన డబ్బులను పాఠశాలలో మూత్రశాలలు భాగు చేయిస్తామని తెలిపారు. ఇక నైనా ఆడపిల్ల మాన అభిమానాలను కాపాడే దిశలో ప్రభుత్వం కళ్ళు తెరిచి మండలంలోని పాఠశాలలను బలోపేతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో తలకొండపల్లి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అన్ని గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులను సమావేశపరిచి పెద్ద ఎత్తున కలెక్టరేట్ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల శ్రీశైలం, సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు గోపాల్ నాయక్, పడకల్ ఎంపిటిసిలు అధ్యక్షులు రమేష్, పెద్దురు ఎంపిటిసి రఘు, సోనిలక్యనాయక్, సర్పంచులు జ్యోతయ్య, శ్రీశైలం,
బండి.రఘుపతి, రాజు, కోప్షన్ మెంబర్ ఇమ్రాన్, సింగిల్ విండో డైరెక్టర్ శేఖర్, నాయకులు కృష్ణ, శ్రీను, యువ నాయకులు విజయ్ మల్లేష్ నాయక్ సాయి నాయక్ యువకులు నాయకులు గ్రామ ప్రజలు పెద్దలు పాల్గొన్నారు