30.7 C
Hyderabad
April 29, 2024 04: 17 AM
Slider కర్నూలు

ఆగస్టు 1 నుంచి చంద్రబాబు ప్రాజెక్టుల పరిశీలన

#CHANDRA BABU

గత మూడు రోజులుగా నీటిపారుదల ప్రాజెక్టులపై జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎండగడుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు ఆగస్టు 1 నుంచి ప్రాజెక్టులు సందర్శన ప్రారంభిస్తున్నారు.

ఆగస్టు ఒకటిన బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ సందర్శన, నందికొట్కూరులో చంద్రబాబు బహిరంగ సభ ఉంటాయి. అనంతరం మచ్చుమర్రి ఎత్తిపోతల పథకం సందర్శన ఉంటుంది అనంతరం ఆలూరులో చంద్రబాబు రాత్రి బస చేస్తారు. ఆగస్టు 2న మాల్యాల ఎత్తిపోతల పథకం సందర్శన, అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పరిశీలన, నందికొట్కూరు గోరకల్లు రిజర్వాయర్ సందర్శన, అనంతరం పాణ్యం, బనగానపల్లి, కోవెలకుంట్లలో పర్యటన అనంతరం జమ్మలమడుగులో చంద్రబాబు రాత్రి బస ఉంటుంది.

ఆగస్టు 3న గండికోట రిజర్వాయరు సందర్శన ఉంటుంది. అనంతరం పైడిపాలెం రిజర్వాయర్ ను చంద్రబాబు పరిశీలించనున్నారు. అనంతపురంలో చంద్రబాబు రాత్రి బస చేస్తారు. ఆగస్టు 4న అమిద్యాలలో నిలిచిపోయిన బిందు సేద్యం ప్రాజెక్టు పరిశీలన చేస్తారు. అనంతరం ఒంటిమెట్ట వద్ద నిలిచిపోయిన జీడిపల్లి-బీటీపీ కాలువ పరిశీలన, ఆత్మకూరు సమీపంలో ఆగిపోయిన జీడిపల్లి-పేరూరు కాలువ పనుల పరిశీలన ఉంటుంది.

Related posts

సజ్జల వారి కొత్త నాటకం మరో బూటకం

Satyam NEWS

తెలుగుదేశం శ్రేణులపై పోలీసుల దౌర్జన్యం: డాక్టర్ చదలవాడ అరెస్టు

Satyam NEWS

నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టుకున్న టాస్క్ ఫోర్స్

Satyam NEWS

Leave a Comment