రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రాముడిని దర్శించుకున్నారు. టీటీడీ వేద పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఒంటిమిట్ట కోదండ రాముడి అభిషేకం లో పాల్గొన్న రమేష్ కుమార్ సీతారామలక్ష్మణులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ కార్గ్, డి.ఎస్.పి శివ భాస్కర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.