రాముడి తల తీసేస్తేనే అడిగేవాడు లేడు సీతమ్మ ఏం చేస్తుందని అనుకున్నారో ఏమో కానీ విజయవాడలో రామాల యంపై దాడి చేసి సీతమ్మ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు.
రామతీర్ధం, కర్నూలు జిల్లా కోసిగి సమీపంలోని మర్లబండ ఆంజనేయస్వామి ఆలయంలోని సీతారాముల విగ్రాహాల ధ్వంసం మరువకముందే విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద ఉన్న శ్రీ సీతారామ మందిరంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.
ఆదివారం ఉయదం గమనించిన ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.