ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి, కర్ణాటక డిప్యూటీ సీఎం అయిన డీకే శివకుమార్ ఆస్తుల విలువ రూ.1,413 కోట్లు కాగా ఆ తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నవారు కర్ణాటకకు చెందిన వారేనని ఏడీఆర్ నివేదిక తెలిపింది.
రెండో స్థానంలో ఉన్న స్వతంత్ర ఎమ్మెల్యే కేహెచ్ పుట్టస్వామి గౌడ ఆస్తుల విలువ రూ.1,267 కోట్లు కాగా, రూ.1,156 కోట్లతో మూడో స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రియా కృష్ణ ఉన్నారు.