28.7 C
Hyderabad
April 27, 2024 04: 16 AM
Slider ముఖ్యంశాలు

రామతీర్ధం రాముడి విగ్రహ ఖండన కేసు సమీక్షించిన సిట్ చీఫ్

#Ramateerdham

రామతీర్ధం నీలాచలం కొండపై రాములోరి విగ్రహ ధ్వంసం కేసును దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన స్పెషల్ ఇన్విస్టిగేషను టీం చీఫ్ డీఐజీ జివిజి అశోక్ కుమార్, సిట్ బృంద రామతీర్ధం నీలాచలం కొండను సందర్శించింది.

నీలాచలం కొండ పైన ఉన్న సంఘటనా స్థలాన్ని వారు కూలంకషంగా పరిశీలించారు. అనంతరం, సిట్ చీఫ్ జివిజి అశోక్ కుమార్ సిట్ బృందం, సీఐడీ, జిల్లా పోలీసు అధికారులు, క్రైం పోలీసులు, సిబ్బంది ఈ కేసులో ఇంత వరకు చేపట్టిన దర్యాప్తు, సాధించిన పురోగతిని జిల్లా పోలీసు కార్యాలయంలో సమీక్షించారు.

పోలీసుశాఖ చేపట్టిన చర్యలను, దర్యాప్తునకు ఏర్పాటు చేసిన నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు, చేపట్టిన చర్యలను, విచారణ చేసిన తీరును సిట్ చీఫ్ డీఐజీ జివిజి అశోక్ కుమార్ జిల్లా ఎస్పీ రాజకుమారిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సిట్ చీఫ్ డీఐజీ జివిజి అశోక్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో కొన్ని జిల్లాల్లోని ఆలయాల్లో ఈ తరహా సంఘటనలు చోటు చేసుకోవడంతో వీటన్నింటికి ఏదైనా ఒకే విధమైన కారణం ఏదైనా ఉందన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి, దర్యాప్తుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినందున త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి, స్థానిక పోలీసుల సహకారంతో కేసు మిస్టరీని చేధించేందుకు తమవంతు కృషిని చేస్తామన్నారు.

ఈ కేసులో ఏదైనా సమాచారం లభిస్తే రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 9392903400కు సమాచారం అందించాలని సిట్ చీఫ్ ప్రజలను కోరారు. ఈ కేసును అన్ని కోణాల్లోను దర్యాప్తు చేస్తున్నామని, అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, కేసు మిస్టరీని ఛేధించేందుకు సిట్ బృందం సభ్యులు ఇతర పోలీసుల సమన్వయంతో, శక్తివంచన లేకుండా పని చేయాలన్నారు.

అంతేకాకుండా, కేసు దర్యాప్తులో అవసరమైన సహాయ, సహకారాలను స్థానిక పోలీసులు సిట్ బృందానికి అందించాల్సిందిగా జిల్లా ఎస్పీ రాజకుమారిని సిట్ చీఫ్ డీఐజీ జివిజి అశోక్ కుమార్ కోరారు.

సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ రాజకుమారి, సీఐడీ అదనపు ఎస్పీ ఎల్.వి.శ్రీనివాసరావు, విజయనగరం డీఎస్పీ పి. అనిల్ కుమార్, సీసీఎస్ డీఎస్పీ జె.పాపారావు, సిట్ డీఎస్పీ ఆర్ఎస్ఎన్ మూర్తి, సీసీఎస్ సిఐ విజయానంద్, ఎస్బీ సీఐలు ఎన్.శ్రీనివాసరావు, జి.రాంబాబు, రూరల్ సీఐ మంగవేణి, నెల్లిమర్ల ఎస్ఐ దామోదర్ పాల్గొన్నారు.

Related posts

జెండా కప్పుకుంటేనే సంక్షేమ పథకాలా..?

Bhavani

కాషాయం ధరించని కర్మ యోగి ఆయన

Satyam NEWS

పిడమర్తి రవిపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలి

Satyam NEWS

Leave a Comment