కడప జిల్లా రాజంపేట కు చెందిన రాష్ట్ర బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు నాగోతు రమేష్ నాయుడు మంగళవారం రాష్ట్ర డీజీపీ కి లేఖరాశారు. ఈ లేఖలో వైసీపీ నేతలు కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా దేశ ప్రధాని మోడీ పై,హోంశాఖ మంత్రి అమిత్ షా పై అభ్యంతరకర వ్యాఖ్యలు,పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. గతంలో స్వయంగా వివరాలతో సహా డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు.
వైసీపీ పై ఎవరైనా పోస్టులు పెడితే మాత్రం కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారను ఆరోపించారు. వైసీపీ వారికే కాదు ఇతరులకు మనోభావాలు ఉంటాయని తెలిపారు. రైల్వే కోడూరు లో బీజేపీ అధ్యక్షుడు సుబ్బయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త బాషాఖాన్ అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేశారని, దీనిపై సి.ఐ. ఆనందరావు కు ఫిర్యాదు చేసినా స్పందించలేదని అన్నారు.
ఇలాంటి ఎన్నో ఉదాహరణలతో పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశామని,ఇప్పటికయినా చర్యలు తీసుకోక పోతే జరగ బోయే పరిణామాలకు మీరే బాధ్యులు అని ఆయన స్పష్టం చేశారు.