ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన సదరం క్యాంపు విజయవంతంగా ముగిసిందని పెన్షన్స్ డీ పీ ఎం పద్మప్రియ తెలిపారు.
ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం మీ సేవలో నమోదు చేసుకున్న దివ్యాంగులకు సదరం క్యాంపు తేదీ స్లాట్ బుక్ అయిన వారు నేడు శారీరక దివ్యాంగులు 36 మంది వినికిడి లోపం దివ్యాంగులు 17 మంది హాజరయ్యారని ఆమె తెలిపారు.
ఈ సదరం క్యాంపు లో ఆర్థోపెడిక్ డాక్టర్లు గౌతమ్ చౌహన్, చందూనాయక్, డాక్టర్ , ఫిజియో థెరపిస్టులు విజయ్ రాజ్, ఆడియాలజిస్ట్ అంజయ్య , సిబ్బంది పాల్గొన్నారు.