సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నందు మంగళవారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలలకు ఫ్యాన్సి డ్రెస్ పోటీలను నిర్వహించారు.విద్యార్ధులు వివిధ జాతీయ నాయకుల వేషధారణలో ఆహుతులను ఆకట్టుకున్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోసాని వెంకటరమణారావు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు వివిధ అంశాలపై అవగాహన పెంపోందించేందుకు కృషి చేస్తున్నామని,జాతీయ పండుగలను నిర్వహిస్తూ వాటి ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియచేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిజిఎం సుధాకర్,ఆర్ ఐ సుజాత,ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు,సంధ్య,మమత,కావ్య, విద్యార్థులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్