రష్యా దేశం ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తూన నేపథ్యంలో ఖమ్మం ప్రాంతానికి చెందిన పూజా హస్పిటల్ డాక్టర్ కుమార్తె పూజని , తిరుమలాయపాలెం మండలం , మేడిదచర్ల గ్రామానికి చెందిన రావుల మహేశ్ రెడ్డి లను భారతీయ జనతా పార్టీ మహిళలు శాలువతో సత్కరించారు . ఉక్రైన్ నుంచి మాత్రృభూమికి రప్పించిన ఇండియన్ ఎంబసీ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు . తదనంతరం వారు పడ్డ ఇబ్బందులు , అనుభూతులను తెలుసుకున్నారు . ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుకోసం ఒకరు , హోటల్ మేనేజ్ మెంట్ కు సంబంధించిన కోర్సు కోసం మరొకరు వెళ్లారని పేర్కొన్నారు .
యుద్ధం జరిగేటప్పుడు ఎటువంటి సదుపాయం లేక కాలినడకతో కొన్ని వందల వరకు నడుచుకుంటూ వచ్చామని , కొన్ని రోజుల వరకు తిండీ తిప్పలు లేక తాగటానికి నీరు దొరక్క అనేక రకాల ఇబ్బందులు పడ్డామని ఉక్రైన్ నుంచి వచ్చిన విధ్యార్ధులు తెలిపారు . ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు దొడ్డ అరుణ , మహిళా మోర్చా స్టేట్ లీగల్ సెల్ కో – కన్వీనర్ కొలిపాక శ్రీదేవి , మహిళా మోర్చా సొషల్ మీడియా జిల్లా కన్వీనర్ దొడ్డా భవాని తదితరులు పాల్గొన్నారు .