సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ సభ్యుడు అశోక్ వాళ్ళ నాన్నమ్మ సారమ్మ అనారోగ్యంతో గురువారం మరణించారు. విషయం తెలుసుకున్న ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ ములుగు జిల్లా వెంకటాపూర్ వెళ్లి మృతురాలి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.
సారమ్మ పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించి, తస్లీమా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను తస్లీమా ఓదార్చారు. దహన సంస్కారాల నిమిత్తం సాయం అందించారు.