రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబం ఆత్మహత్య యత్నం చేసింది. ఇద్దరు పిల్లలకు నిద్ర మాత్రలు వేసి దంపతులు తాము మింగారు. పిల్లలు వాంతులు చేసుకోవడం తో ప్రమాదం తప్పింది. భార్య శ్వేతా భర్త శశి కుమార్ స్థానిక ఆర్కా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
శశి కుమార్ ఖమ్మం నుండి ఇటీవల సరూర్ నగర్ కు వచ్చారు. తాను చేసిన కాంట్రాక్టు బిల్లులు రాకపోవడం లేదని అతను ఆత్మహత్యా యత్నం చేసినట్లు చెబుతున్నారు. కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వకుండా వేధింపులకు చేస్తుండడంతో దంపతులు మనస్తాపానికి గురయ్యారు.
దీనితో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం తో ఆత్మహత్య చేసుకోవాలి అని వారు నిర్ణయం తీసుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.