సాక్షాత్తు ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం రాజన్న దొరపై..టిడిపి గళం ఎత్తింది. ఈ మేరకు స్పందన లో జిల్లా కలెక్టర్ కు దేశం నేతలు అను రాధ బేగం, ప్రసాదుల లక్ష్మీ వర ప్రసాద్ కనకల తదితరులు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం ,సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర….పాఠశాల పిల్లలను సరస్వతీ పుత్రులు గా చూడటం లేదని విజయనగరం జిల్లా టీడీపీ ఆక్షేపించింది.గత నెల 28 మెంటాడ మండలం లో ఓ పాఠశాల లో విద్యార్ధులకు ట్యాబ్ ల పంపిణీ లి ముఖ్య అతిధిగా హాజరైన డిప్యూటీ సీఎం రాజన్న దొర మాట్లాడిన మాటలు సహేతుకంగా లేవని టీడీపీ నేతలైన మహిళా విభాగ నేతలు అనురాధ బేగం తదితరులు అన్నారు.
మెంటాడ మండలం, పెదమేడపల్లి మోడల్ స్కూల్లో విద్యార్థినులకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమమునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర గారు ముఖ్యఅతిధిగా హాజరైనారని… ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు మోడల్ స్కూల్ విద్యార్థినులను సుమారు 2 గంటలకు పైగా సమయం (ఉదయం 10 గంటల నుండి సమారు మధ్యాహ్నం 12 గంటల వరకు) ఎండలో నిలబెట్టినందును వారు చాలా ఇబ్బందులకు గురయ్యారని టీడీపీ పేర్కొంది. వారిలో ఎక్కువ మంది విద్యార్థినులు ఎండ వేడిమి తాళలేక సొమ్మసిల్లి పడిపోయారని.. సదరు విషయం మీడియా లో కూడా వచ్చిందని ఫిర్యాదు చేశారు… టీడీపీ నేతలు.ఈ విషయమై డిశెంబర్ 31 జాతీయ మహిళా కమీషన్ వ తెలియజేయడం జరిగిందని పేర్కొంది.ఈ క్రమంలో తమరు సదరు విషయమై తగు విచారణ జరిపించి, భవిష్యత్తులో విద్యార్థినిలను ఇబ్బందులకు గురిచేసే ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడవలసినదిగా టీడీపీ కోరుతోంది.