నిన్నటి వరకు ఉప్పు నిప్పు లా ఇద్దరు నేతలు బేటీ అయ్యి ఒకరిని ఒక్కరు ఆప్యాయంగా పలుకరించు కోవడంతో రాజంపేట టీడీపీ శ్రేణులు ఉబ్బి తబ్బిబీ అయ్యారు. ఇదే ఒరవడితో టీడీపీ గెలుపుకు కృషి చేయాలని కోరుకున్నారు. అసలు విషయం లోకి వస్తే… అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడి గా జిల్లా నేత ప్రముఖ విద్యావేత్త చమర్తి జగన్మోహన్ రాజు నియమిస్తూ టిడిపి అధిష్టానం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
ఈ నేపధ్యంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్ మోహన్ రాజు సోమ వారం రాత్రి రాజంపేట టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు ని మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా బత్యాల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కష్టపడే వాళ్లకు గుర్తింపు ఇస్తుందని జగన్మోహన్ రాజు విషయంలో మళ్ళీ తేలిందని, పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేయడానికి నియోజకవర్గంలో అభివృద్ధి కోసం, పార్టీ కార్యక్రమాలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ కార్య క్రమంలో మండలంలోని పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.