40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలుగుదేశం జెండా ఎగురవేశారు. అనంతరం సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో పార్టీ స్థాపించి తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలుతో నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా చెక్కుచెదరని ప్రజా అభిమానంతో కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీకి బలం కార్యకర్తలు, నాయకులేనని అన్నారు. పార్టీ ఆరంభించిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి పేదలకు కూడు,గూడు,గుడ్డ అందించే పథకాలు ఆరంభించారని ఆయన తెలిపారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ వర్గాల నుంచి యువతరాన్ని రాజకీయాలకు పరిచయం చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అని ఆయన అన్నారు.
తెలుగుజాతి ఆత్మగౌరవం నినాదంతో బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచేందుకు మహా నాయకుడు నందమూరి తారక రామారావు స్థాపించిన మన తెలుగుదేశం పార్టీ 40 వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు కడియాల రమేష్ బాబు, నరసరావుపేట, రొంపిచర్ల మండల పార్టీ అధ్యక్షులు బండరుపల్లి విశేశ్వరావు, వెన్న బలకోటి రెడ్డి,
పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలు దాసరి ఉదయ్ శ్రీ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు లింగా వెంకటేశ్వర్లు, మెట్టు వెంకటేశ్వర రెడ్డి, పులిమి రామి రెడ్డి, మాజీ ఎంపీపీ మొండితోక రామారావు, మాజీ సంగం డైరీ డైరెక్టర్ మక్కెన ఆంజనేయులు, పెద్దారెడ్డిపాలెం సర్పంచ్ ఇండ్లమూరి రామారావు, మాజీ కౌన్సిలర్లు రావెళ్ల లక్ష్మీ నారాయణ, సంజీవరావు, చంద్రశేఖర్, గడ్డం కరిముల్లా, లీగల్ సెల్ అడ్వొకేట్స్ చెన్నుపాటి నాగేశ్వరరావు, సీతారామాంజనేయులు, గుండాల సురేష్,పట్టణ ప్రధాన కార్యదర్శి గూడూరు శేఖర్, సీనియర్ నాయకులు వల్లెపు నాగేశ్వరరావు, గొట్టిపాటి జనార్దన్ బాబు,
మన్నన్ షరీఫ్,కడియాల తాండవ కృష్ణ, చవపాటి సైదవాలి, పులుకురి జగ్గయ్య, ఇమిడిశెట్టి కాశయ్య, ముప్పాళ్ల నాగేశ్వరరావు,రఫీ, శాఖమురి మారుతి, బంగారం, సుభాని, నాగూర్, అనిల్ రాజు, బాషా నియోజకవర్గంలోని ముఖ్య నాయుకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.