ప్రజలే దేవుళ్లు…సమాజామే దేవాలయం అంటూ 40 ఏళ్ల క్రితం ఆవిర్బావం చెందిన టీడీపీ దినోత్సవాన్ని ఆ పార్టీ విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత తమ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
తెలుగుప్రజల ఆత్మగౌరవ నినాదంతో అన్న నందమూరి తారకరామారావు టీడీపీని స్థాపించి ఇవాల్టికి 40 ఏళ్లు పండుగ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీసాల గీత అన్న నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం, పేద ,బడుగు, బలహీన వర్గాల వారికి కూడు, గూడు, గుడ్డ అందరికీ అందించి, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని నమ్మి ఆచరించిన వ్యక్తి సర్గీయ ఎన్టీఆర్ అని ఆమె అన్నారు. అందరి మనసుల్లో స్థిరమైన స్థానాన్ని పొందిన మహానీయుడు, కారణజన్ముడు అయిన నందమూరి తారకరామారావు స్ఫూర్తి గా తెలుగుజాతి యావత్తు తీసుకుందన్నారు. ఇక ఆ పార్టీ కీర్తిని ప్రపంచదేశాల మన్ననలు పొందే విధంగా మాజీ సీఎం ప్రస్తుత పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రజారంజక పాలనతో పార్టీని నడిపించిన విధానాన్ని అందిపుచ్చుకున్నారని మీసాల గీత అన్నార. ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ప్రజాసమస్యల పట్ల పోరాటం చేస్తూ పార్టీని నడిపిస్తున్న తీరు తెలుగుజాతి ఉన్నంత వరకు మర్చిపోదన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజలకోసం, ప్రజలచేత, ప్రజాభివృద్ధికి ఎప్పుడూ పాటుపడుతుందని ఆమె ఈ సందర్భంగా ఆమె తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమీటీ ఛైర్మన్ సైలాడ త్రినాథరావు గారు, ఎస్. ఎన్. ఎమ్.రాజు, , దాట్ల రవిరాజ్ ,, రొంగలి రామారావు, అంబళ్ళ సూర్యప్రకాశ్, తాడి జయప్రకాష్, ప్రసాద్, సుంకరి శ్రీను, గోగుల ప్రణయ్, గుప్త తదితరులు పాల్గొన్నారు.
previous post