నివర్ తుఫాన్ కారణంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు,వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి.
ఈ క్రమంలో గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో రొంపిచర్ల మండలంలోని తుంగపాడు కాలువ,సత్తెనపల్లి రోడ్డు, గుంటూరు రోడ్డు, ప్రవహించే కుప్పగంజి వాగు పొంగి పొర్లుతుంది.
విషయం తెలుసుకున్న నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు పర్యటించి ప్రజలను ఆయా ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు.