ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన ఎన్నికలను అధికార బలంతో దక్కించుకోవాలని వైసీపీ ప్రయత్నించడం అత్యంత నీచం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
ప్రజల్లోకి వెళ్తే చిరిగిన రబ్బర్ చెప్పులు తడిపి, పేడలో ముంచి వైసీపీ అభ్యర్ధుల్ని తరిమి కొట్టడం ఖాయమని ఆయన అన్నారు.
అందుకే ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేక తెలుగుదేశం పార్టీ తరఫున పలాస మున్సిపల్ కార్పొరేషన్ కు నామినేషన్ వేసిన కౌన్సిలర్లను బెదిరించి, భయపెట్టి, బలవంతంగా వైసీపీలో చేర్చుకోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు.
పలాసలో వైసీపీ నేతలు, మంత్రి అప్పలరాజు చేస్తున్న అరాచకాలను ప్రజలు గుర్తించారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులను, వైసీపీ నేతల్ని పలాస జీడి ఫ్యాక్టరీల్లోని చెత్త కంటే దారుణంగా తీసి పక్కన పడేయనున్నారు.
అధికార మదం, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఏకపక్షాల చేసుకునేందుకు, నామినేషన్లు ఉపసహరించుకునేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇది ముమ్మాటికీ వైసీపీ దురాగతానికి, నీతిమాలిన రాజకీయాలకు నిదర్శనం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.