తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందా లేదా అనే విషయమై నేడు స్పష్టత వచ్చింది. తెలంగాణ ఎన్నికల బరిలోకి టీడీపీ కూడా దిగనుంది. ఈ క్రమంలోనే ఈ అసెంబ్లీ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ ఫోకస్ చేసింది. ఏడుగురు సభ్యులతో టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో ఒక కమిటీని నియమించారు. కమిటీలో కాసాని జ్ఞానేశ్వర్, రావుల చంద్రశేఖరరెడ్డి, అర్వింద్ కుమార్ గౌడ్, కంభంపాటి రామ్మోహనరావు, బక్కని నరసింహులు, కాశీనాథ్, నర్సిరెడ్డిలకు చోటు కల్పించారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటి స్వీకరించనుంది. అనంతరం చంద్రబాబుకు నివేదిక సమర్పించనుంది. కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను టీడీపీ ప్రకటించనుంది.
previous post