42.2 C
Hyderabad
May 3, 2024 17: 19 PM
Slider కడప

600 వందల రోజుల అమరావతి పోరుబాటకు టీడీపీ శ్రేణుల సంఘీభావం

#tdp kadapa

600 వందల రోజుల అమరావతి దీక్షలకు మద్దతుగా కడప జిల్లా రాజంపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు ఆధ్వర్యంలో సంఘీభావం ప్రకటించారు.

అమరావతి రాజధానికి, రైతులకు మద్దత్తుగా వినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు.

అమరావతి రాజధాని వస్తుందని రైతులు భూములు ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత మాట మార్చారని అన్నారు.

రైతుల పై కేసులు పెట్టినా భయపడకుండా గాంధేయవాద పద్ధతిలో 600 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారని వారిని అభినందించారు.

వారికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధాకర్, అనసూయమ్మ, అద్దెపల్లె ప్రతాప్ రాజు,మందా శ్రీను,సంజీవ రాయుడు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మంగపేట కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడుగా ముత్తినేని

Satyam NEWS

తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన రావి కొండలరావు

Satyam NEWS

కుటుంబ సభ్యుల మధ్య బాలకృష్ణ జన్మదినం

Satyam NEWS

Leave a Comment