26.7 C
Hyderabad
May 1, 2025 04: 29 AM
Slider ముఖ్యంశాలు

టీటీడీ చైర్మన్ గా మళ్లీ వై వి సుబ్బారెడ్డి నియామకం

#y v subbareddy

తిరుమల తిరుప‌తి దేవ‌స్ధానాల చైర్మన్ గా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి వై వీ సుబ్బారెడ్డి రెండోసారి నియ‌మితుల‌య్యారు. ఆయ‌న‌ నియామకపు ఉత్త‌ర్వుల‌ను రాష్ట్ర ప్రభుత్వం నేడు జారీ చేసింది.

వ‌రుస‌గా రెండోసారి టీటీడీ చైర్మ‌న్ గా నియ‌మితులైన సుబ్బారెడ్డి ఈ నెల 12వ తేదీన ప‌ద‌విని స్వీక‌రిస్తార‌ని తెలుస్తోంది. 12లోపు టీటీడీ స‌భ్యుల‌ను కూడా నియ‌మిస్తే అంద‌రితో క‌ల‌సి ఆయన ప‌ద‌విని స్వీక‌రిస్తార‌ని, స‌భ్యుల ఎంపిక ఆల‌స్యం అయితే ఆయ‌న ఒక్క‌రే ప‌ద‌వీ ప్ర‌మాణం చేస్తార‌ని తెలుస్తోంది.

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ గా నియమించారు.

ఇటీవ‌లే ఆయ‌న ప‌ద‌వీకాలం పూర్తి అయింది. పదవీ కాలం పూర్తి అయింది కాబట్టి మరొకరికి అవకాశం ఇచ్చి సుబ్బారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని అందరూ భావించారు. అయితే మ‌ళ్లీ ఆయ‌న‌నే టీటీడీ చైర్మన్ గా నియ‌మించారు.

Related posts

ఉగ్ర రూపం దాల్చిన పెన్నా నది

Satyam NEWS

కుమ్మరి సంఘం నేతను పరామర్శించిన నాగజ్యోతి

Satyam NEWS

రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!