వనపర్తి జిల్లా అభివృద్ధికి జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు సహాయ సహకారాలు అందించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ (పాలనాధికారి)- తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ పాలనాధికారి బాధ్యతలు చేపట్టారు. ఆయనకు అదనపు కలెక్టర్ వేణుగోపాల్ స్వాగతం పలికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల ప్రజలకు చేరేలా ప్రతి ఒక్క అధికారి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో పద్మావతి, జిల్లా డిపిఆర్వో రషీద్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్