రాష్ట్ర వ్యాప్తంగా 36 లక్షల మంది, దేశ వ్యాప్తంగా 27 కోట్ల మంది జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కార్మికులు, ఉద్యోగులు, రైతులు, ప్రజలు, టిఆర్ఎస్ ప్రభుత్వ కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి పేరుపేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో కార్మికులతో రోషపతి మాట్లాడుతూ కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం తక్షణమే సమస్యలను పరిష్కారం చేయాలని, దొడ్డిదారిన చట్టాల సవరణ తెచ్చిన జీవోలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. శ్రమజీవుల హక్కులను హరించాలని చూసే ఏ ప్రభుత్వం అయినా చరిత్రలో హీనంగా మిగిలి పోతుందన్న విషయాన్ని గ్రహించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సి ఐ టి యు నాయకులు మెరుగ దుర్గారావు, వెంకట్ రాములు, కస్తాల సైదులు, గోపి, ముత్తమ్మ, తదితర కార్మికులు పాల్గొన్నారు.