కొమురం భీం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ను స్థాపించాలని అదిలాబాద్ ఎంపీ సాయం బాబురావు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ను కోరారు.
ఎంపీ బాబురావుతో బాటు కేంద్ర మంత్రిని కలిసిన వారిలో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యలు, సిర్పూర్ కాగజ్ నగర్ బిజెపి ఇన్ చార్జి డా కొత్తపల్లి శ్రీనివాస్ ఉన్నారు.
కొమురం భీం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల అవసరాన్ని డా కొత్తపల్లి శ్రీనివాస్ వివరించారు. దీనికి కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ సానుకూలంగా స్పందించారు.
కేంద్ర మంత్రిని కలిసిన వారిలో సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డ్ మెంబెర్ కె సి భార్గవ్ కూడా ఉన్నారు.