తిరుమల కొండపై భక్తుల దర్శనాలకు ఆటంకం ఉండదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. భక్తుల ద్వారా కరోనా వ్యాప్తి చెందడం లేదని తాము నిర్ధారణకు వచ్చామని ఆయన తెలిపారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న భక్తులకు దర్శనం కల్పిస్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
అయితే తిరుపతిలో లాక్డౌన్ నేపథ్యంలో స్థానిక బుకింగ్ నిలిపివేశామని ఆయన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా కంటైన్మెంట్ జోన్లలో ఉండే వారు తిరుమలకు రావొద్దని వైవీ సుబ్బారెడ్డి సూచించారు. కరోనా సోకిన అర్చకులు, ఉద్యోగులకు మెరుగైన చికిత్స అందిస్తామని భక్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వివరించారు.