40.2 C
Hyderabad
April 29, 2024 18: 09 PM
Slider ఆధ్యాత్మికం

ముత్యపు కవచంలో శ్రీ మలయప్ప అభయం

#Tirumala Sri Balajee

తిరుమల శ్రీవారి వార్షిక జేష్ఠాభిషేకంలో భాగంగా రెండో రోజు శుక్ర‌వారం శ్రీదేవి భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు ముత్యపు కవచం ధరించి అభ‌య‌మిచ్చారు. ఉదయం 7.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు.

ఉదయం 8 గంటలకు ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. అనంతరం ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీ మలయప్పస్వామి వారికి, దేవేరులకు అభిదేయక అభిషేకం చేపట్టారు. సాయంత్రం శ్రీ మలయప్పస్వామివారికి ముత్యపు కవచ సమర్పణ జరిగింది.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి ఛైర్మ‌న్  వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ  అనిల్ కుమార్ సింఘాల్, అద‌న‌పు ఈవో  ఏ.వి.ధ‌ర్మారెడ్డి,  ఆలయ డెప్యూటీ ఈవో  హరీంద్రనాథ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

సర్టిఫైడ్ బిచ్చగాడు అఖిలేష్ యాదవ్‌ : ఒవైసీ

Sub Editor

ప్రభుత్వం పై జేసీ దివాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Satyam NEWS

ప్రభువు దీవెనలు మీ అందరిపై ఉండాలి: ఉప్పల్ ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment