కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన రైతు వ్యతిరేక బిల్లులు నిరసిస్తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు రైతులతో కలిసి నేడు భారీ ఎత్తున ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టారు.
మొదటగా మధిర నుంచి భట్టి విక్రమార్క 700 ట్రాక్టర్లతో ర్యాలీగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు స్వచ్ఛందంగా పాల్గొనడం విశేషం.
భట్టి విక్రమార్క మల్లు చేస్తున్న రైతు ట్రాక్టర్ల ర్యాలీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, మరో వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.