ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామంలో రోడ్డు భద్రత అవగాహన సదస్సును నేడు తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వరరావు నిర్వహించారు.
బీరెల్లి బయ్యారం రోడ్డు, కాటాపూర్ క్రాస్ రోడ్డు వద్ద తరుచు ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా ప్రమాదాల నివారణకు స్పీడు బ్రేకర్లు వేశారు.
ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ స్థానిక ప్రజాప్రతినిధులు, ఆటో యూనియన్ నాయకులు వర్తక సంఘం నాయకులు సహకారం అందించారు. తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వరరావు స్వయంగా స్పీడు బ్రేకర్లు వేశారు.