ఇటీవల మరణించిన గిరిజన నాయకుడు లకావత్ రామారావు కుటుంబ సభ్యులను నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు, రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం పరామర్శించారు.
సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచెరువు మండలం పీక్లా నాయక్ తండాలో ఇటీవల మరణించిన ప్రముఖ గిరిజన నాయకుడు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపిటిసి, దివంగత లకావతు రామారావు తల్లిదండ్రులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.