త్రిపురలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ.. అక్కడ స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికల్లో తొలిసారిగా బరిలోకి దిగింది. అయినప్పటికీ అపూర్వ విజయాన్ని బీజేపీ సొంతం చేసుకుంది. దీంతో పశ్చిమ బెంగాల్తోపాటు త్రిపురలోనూ టీఎంసీ జెండా ఎగరేస్తుందన్న తరుణంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
త్రిపుర స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధిక్యత కనబర్చింది. త్రిపురలో మొత్తం 20 మునిసిపాలిటీలకు గానూ 14 స్థానాల్లో ఓటింగ్ జరిగింది. బీజేపీ అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. మొత్తం 334 వార్డులకు గానూ బీజేపీ ఇప్పటికే 112 స్థానాల్లో ఏకపక్షంగా విజయం సాధించింది.