ప్రస్తుత ఏండ్రాయిడ్ ,ఐ ఫోన్ ల లాంటి స్మార్ట్ యుగంలో పలు జాతీయ పరీక్షలలో అలాగే జాతీయ కోర్సు లలో ఉత్తీర్ణత సాధించాలంటే అంత ఈజీ కాదని ప్రతీ ఒక్క విద్యార్ధి కన్నవారి కి తెలుసు. అందుచేత అత్యుత్తమ, అర్హత.. ఉత్తీర్ణత పొందిన విద్యా సంస్థ లలో తమ, తమ పిల్లలను చదివించాలని ప్రతీ తల్లిదండ్రి తపనపడుతునే ఉంటారు. ఈ క్రమంలో నే..విద్యా సంస్థలను నడిపించడంలో…అందున కోరుకొండ ,నవోదయ లాంటి సీబీఎస్ఈ జాతీయ విద్యాలయాల్లో చదివేందుకు అర్హత పొందే ప్రవేశ పరీక్షలకు…కోచింగ్ ఇచ్చే విద్యా సంస్థ…విజయనగరం లో “త్రిశూల్ రమణ విద్యా సంస్థలు”.
తాజాగా… పిల్లల కన్నవాళ్ల అభిరుచులకు అనుగుణంగా… పిల్లలకు ఉచితంగా నవోదయ, కోరుకొండ సైనిక్ స్కూళ్ల ప్రవేశ పరీక్షల కు తర్ఫీదు ఇవ్వబోతోంది…. త్రిశూల్ సంస్థలు. గత 30 ఏళ్ల నుండి సైనిక్ స్కూల్ , నవోదయ ప్రవేశ పరీక్షలకు అత్యుత్తమమైన శిక్షణ ఇచ్చి 400 మంది విద్యార్దులకు పైగా సైనిక్ స్కూల్ లోనూ, మరో 400 మంది విద్యార్దులకు నవోదయ స్కూల్ లోనూ సీట్లు సాధించి, 600 మంది పైగా విద్యార్డులను దేశ రక్షణ రంగంలోను, డాక్టర్స్ గాను, ఇంజనీర్స్ గాను, సాఫ్ట్ వేర్ రంగం లోను, ఇతర రంగాలలోను అత్యుత్తమ స్థానాలలో స్థిరపడటానికి “త్రిశూల్ రమణా స్కూల్” మంచి పునాది వేసింది అని చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నామని చెప్పారు.
కోచింగ్ ప్రారంభించి 30 ఏళ్ళు అయిన సందర్భంగా ఈ ఏడాది మా సంస్థ 30 మంది విద్యార్డులకు ప్రత్యేకంగా సైనిక్ స్కూల్, నవోదయ స్కూల్స్ కు 23 – 24 సంవత్సరం లో జరిగే 6 ,8వ తరగతి ప్రవేశ పరీక్షలకు అత్యుత్తమ కోచింగ్ ఇవ్వడానికి నిర్ణయించామని త్రిశూల్ సంస్థల అధినేత కుమార్ తెలిపారు. ఈ బ్యాచ్ లో విద్యార్డులను ఎంట్రన్స్ నిర్వహించి సీట్స్ కేటాయించడం జరుగుతుంది. ఈ కోచింగ్ బ్యాచ్ కు ఈ నెల మే 28న ఎంట్రన్స్ నిర్వహిస్తున్నాముని తెలిపారు. ప్రవేశ పరీక్ష లో మొదటి 5 ర్యాంక్స్ సాధించన విద్యార్డులకు కోచింగ్ పూర్తిగా ఉచితంగా ఇవ్వబడును.
తదుపరి 5 ర్యాంక్ లకు ఫీజు లో 50 శాతం మినహాయింపు ఇవ్వబడుతుందని స్కూల్ కరస్పాండెంట్ తెలిపారు. ప్రవేశ పరీక్ష లో లెక్కలు 50 మార్కులకు, లాంగ్వేజ్ 50 మార్కులకు మరియు జనరల్ నాలాడ్జ్ 50 మార్కులకు సంబంధించి ప్రశ్నలు ఉంటాయన్నారు. పరీక్షకు హాజరు అయే విద్యార్దులు ఈ నెల 27 వ తేదీ లోగా పేర్లు నమోదు ఫోన్ ద్వారా లేక స్కూల్ కు వచ్చి నమోదు చేసుకోవాలని మరిన్ని వివరములకు త్రిశూల్ రమణా స్కూల్… బాలాజీనగర్, విజయనగర ఫోన్ : 9440435085 నెంబర్ ను సంప్రదించాలని ఆ సంస్థ ల అధినేత కుమార్ తెలియజేసారు.