42.2 C
Hyderabad
April 26, 2024 17: 51 PM
Slider చిత్తూరు

రూ.3,200 కోట్ల తో టీటీడీ వార్షిక బడ్జెట్

#Tirumala Hills

తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ రూ.3,200 కోట్లుగా ముఖ్య కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల జీతాల కోసం రూ.1,350 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు కార్పస్ ఫండ్ నుంచి నిధులు తీసుకోవడం లేదన్నారు.

భవిష్యత్తులో టీటీడీ బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ నెలాఖరు తర్వాత కేంద్రం ప్రకటించే అన్‌లాక్‌ నిబంధనలను బట్టి.. బ్రహ్మోత్సవాలపై పాలకమండలిలో నిర్ణయం తీసుకుంటామని ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అన్నారు.

శ్రీవారి కల్యాణోత్సవాలను ఆపాలని అర్చకులు తమతో చర్చించలేదని, పాజిటివ్‌ వచ్చిన అర్చకుల్లో ఎక్కువ మంది చికిత్స నుంచి కోలుకుని తిరిగి విధులకు వస్తున్నారన్నారు.

Related posts

ములుగు జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తం

Satyam NEWS

డిజిపి గౌతమ్ సవాంగ్ ఐపిఎస్సా లేక వైపిఎస్సా ?

Satyam NEWS

బెల్ట్ షాపులు మూసేస్తే ఐదు లక్షలు ఇస్తా

Satyam NEWS

Leave a Comment