తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు జూన్ 17వ తేదీ వరకు ఉండే ఆఫ్లైన్ దర్శన టోకెన్లను బుధవారం నుండి తిరుపతిలో జారీ చేస్తున్నారు. తిరుపతిలోని విష్టునివాసం(8 కౌంటర్లు), శ్రీనివాసం(6 కౌంటర్లు), అలిపిరి వద్దగల భూదేవి కాంప్లెక్స్లో (4 కౌంటర్లు) దర్శన టోకెన్ల జారీ కొనసాగుతోంది.
ఒక రోజు కోటాలో 3,750 టోకెన్లు ఉన్నాయి. బుధవారం సాయంత్రం కౌంటర్లు మూసే సమయానికి జూన్ 14వ తేదీ వరకు ఉన్న దర్శన టోకెన్లను జారీ చేశారు. మిగిలిన టోకెన్లను గురువారం ఉదయం 7 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు లేదా నిర్దేశిత కోటా ఉన్నంత వరకు జారీ చేస్తారు.