ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో ఇద్దరు పసి పిల్లలు మరణించారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఇద్దరు చిన్నారుల మృతి చెందారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శ్రావణి లింగస్వామి దంపతుల చిన్నారి చికిత్స కోసం నీలోఫర్ ఆసుపత్రిలో చేర్చారు. సెలైన్ ద్వారా ఇవ్వవలసిన ఇంజక్షన్ ను ఆయా పొరపాటున ఒకేసారి డైరెక్ట్ గా నర్వ్ లోకి ఎక్కించడం తో ఇంజక్షన్ వికటించి చిన్నారి మృతి చెందిందని అంటున్నారు. అదే వార్డులో ఉన్న మరో చిన్నారికి కూడా ఈ విధంగానే ఇంజక్షన్ ఇవ్వడంతో ఆ చిన్నారి కూడా మృత్యువాత పడిందని చెబుతున్నారు. నాగర్ కర్నూల్ కు చెందిన చిన్నారి బంధువులు వెంకట్, నాగమణి లు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. ఒకేసారి ఒకే సమయంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం తో నీలోఫర్ ఆసుపత్రి లో కలకలం చెలరేగింది. ఇద్దరు చిన్నారుల మృతి సహజ మరణమేనని డాక్టర్ లు తెలిపారు.
previous post