28.7 C
Hyderabad
April 27, 2024 05: 22 AM
Slider మహబూబ్ నగర్

కల్వకుర్తి డిపోకు రెండు సూపర్ లగ్జరీ బస్సులు

#rtc

కల్వకుర్తి డిపోకు రెండు సూపర్ లగ్జరీ బస్సులు వచ్చాయని శ్రీకాంత్ తెలిపారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి బస్ డిపోకు  రెండు సూపర్ లగ్జరీ బస్సులు హైదరాబాదు నుండి తిరుపతికి వెళ్లేందుకు ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ శ్రీకాంత్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్31z 0060,0061 రెండు సూపర్ లగ్జరీ బస్సులు వచ్చాయని, తిరుపతికి ప్రయాణించే ప్రయాణికులు సద్వినిగం చేసుకోవాలని అదేవిధంగా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా వెళ్లి దైవదర్శనం చేసుకొని తిరిగి స్వగ్రామం చేరడానికి వీలుగా బస్సు సమయపాలన నిర్ణయించినట్టు పేర్కొన్నారు.బస్సు టికెట్లు ఆన్లైన్ లో కూడా బుకింగ్ చేసుకోవచ్చని 300 అదనంగా చెల్లిస్తే దర్శనానికి కూడా వీలుంటుందని తెలిపారు. తిరుపతి వెళ్లటానికి ఒక టికెట్టు ధర 1060 రూపాయలుగా నిర్ణయించినట్లు చెప్పారు.ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు ఐదు నుండి 10 శాతం వరకు రాయితీ కల్పిస్తున్నట్లు ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియం చేసుకొని  సహకరించగలరని కోరారు.

Related posts

కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఖర్గే

Satyam NEWS

ఎస్సై, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షా ఫలితాలు విడుదల

Murali Krishna

జీహెచ్ఎంసి ఎన్నికలకు అస్త్రశస్త్రాలు సిద్ధం

Sub Editor

Leave a Comment