అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆదేశాలతో కర్నాటక మద్యం, మట్కాలపై ఉరవకొండ సర్కిల్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. 33 మందిని అరెస్టు చేశారు. వీరి నుండీ రూ. 6,08,650/- నగదు, 576 టెట్రా పాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. గుంతకల్లు ఇన్ఛార్జి డీఎస్పీ చైతన్య, ఉరవకొండ సి.ఐ శేఖర్ లు బుధవారం మీడియాకు వివరాల వెల్లడించారు.
ఉరవకొండ సర్కిల్ పరిధిలోని విడపనకల్లు, వజ్రకరూరు, ఉరవకొండ మండలాలలో కర్నాటక మద్యం, మట్కాలపై సి.ఐ శేఖర్ ఆధ్వర్యంలో సర్కిల్ ఎస్సైలు రమేష్ రెడ్డి, గోపాలుడు, వెంకటస్వామిల ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిఘా వేశారు. ఈక్రమంలో సర్కిల్ పరిధిలోని మూడు మండలాలలో దాడులు నిర్వహించి 33 మందిని అరెస్టు చేశారు.
వీరి నుండీ రూ. 6,08,650/- నగదు, 576 కర్నాటక టెట్రా పాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఆరుగురిపై మద్యం కేసులు… మిగిలిన వారిపై మట్కా కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన గేమింగ్ చట్టం ప్రకారం ఎవరైనా మట్కా ఆడినా… నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ పేర్కొన్నారు. అంతేకాకుండా… కర్ణాటక మద్యం విక్రయించినా, సరఫరా/రవాణాలకు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు.