కరీంనగర్ పట్టణంలోని మార్కెట్ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నేడు వైకుంఠ ఏకాదశి వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా వారితోనే క్యూలైన్లో నడిచి సాధారణ భక్తులు లాగే మంత్రి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకున్ని ఈ రోజు దర్శించుకోవడం పూర్వ జన్మ సుకృతం అని చెప్పారు.
previous post