37.2 C
Hyderabad
April 26, 2024 20: 53 PM
Slider మహబూబ్ నగర్

పెంట్లవేల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి

#pentlavelli

వైకుంఠ తొలి ఏకాదశి సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవేల్లి మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేత చింతలపలి జగదీశ్వర్ రావు సతీ సమేతంగా హాజరయ్యారు. ఆ దంపతులు శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి నూతన వస్త్రాలను సమర్పించారు. అనంతరం  వేంకటేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్త జీవన్, మాజీ సర్పంచ్ కోట్ల సురేందర్ లు జగదీశ్వర్ రావు దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గోవు రాజు, పెంట్లవేల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నీరడి కురుమూర్తి, మోహన్, నారాయణ, కోట్ల కొండల్, కృష్ణ, నరేష్ యాదవ్, చెన్నకేశవు తదితరులు పాల్గొన్నారు.

Related posts

హామీలను వెంటనే పరిష్కరించాలి

Murali Krishna

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్

Satyam NEWS

కేసీఆర్ ను కలిసిన కూసుకుంట్ల

Murali Krishna

Leave a Comment