వైకుంఠ తొలి ఏకాదశి సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవేల్లి మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేత చింతలపలి జగదీశ్వర్ రావు సతీ సమేతంగా హాజరయ్యారు. ఆ దంపతులు శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి నూతన వస్త్రాలను సమర్పించారు. అనంతరం వేంకటేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్త జీవన్, మాజీ సర్పంచ్ కోట్ల సురేందర్ లు జగదీశ్వర్ రావు దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గోవు రాజు, పెంట్లవేల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నీరడి కురుమూర్తి, మోహన్, నారాయణ, కోట్ల కొండల్, కృష్ణ, నరేష్ యాదవ్, చెన్నకేశవు తదితరులు పాల్గొన్నారు.
previous post