ఈ నెల జరగనున్న ప్రాదేశిక ఎన్నికల అనంతరం పదోన్నతి పై బదిలీ కానున్న విజయనగరం జిల్లా 26వ కలెక్టర్ డా.హరి జవహర్ లాల్ ,ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మొక్క ల పెంపకం ఆంటే అమితమైన ఇష్టం.
మొక్కల పెంపకం పై దృష్టి పెట్టిన కలెక్టర్.. ఇప్పటి వరకు కొన్ని వందల మొక్కలు నాటారు. తాజాగా జిల్లా కేంద్రంలో ని ఓ శ్మశానం లో మొక్కలు నాటారు.
కలెక్టర్ ఏమిటి ,శ్మశానం లో మొక్కలు నాటడమేంటి ఆశ్చర్య పోకండి.నగరంలో దుప్పాడ , పాల్ నగర్ తర్వాత అయ్యన్నపేట వద్ద ఉన్న శ్మశానాన్ని..స్థానికులు.. శుభ్రం చేసి..పచ్చదనాన్ని పెంపొందించే యత్నం చేసారు.
దీంతో హరిత కి ఆర్డినేషన్ బృందం కాలనీ వాసులతో సంప్రదించి..మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టింది. దీంతో అక్కడే 70 మొక్కలను నాటేందుకు నడుం బిగించారు.
ఈ మేరకు జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్..ఉదయం 6.30 కి వచ్చి..మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో హరిత కో ఆర్డినేటర్ రామ్మోహన్ రావు ,ఈశ్వర్, పోలీసు శిక్షణ పొందుతున్న విద్యార్థులు.. సాయి ,రవి ,గణేష్ కాలనీ వాసులు పాల్గొన్నారు.