ప్రజలందరికీ శుభాలు కలగాలని, వెంకటేశ్వరుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి పై ఉండాలని విజయనగరం ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సూర్యనారాయణ రాజు (డాక్టర్ సురేష్ బాబు), ఇందుకూరి రఘు రాజులు అభిలషించారు. ఈ తెల్లవారుజామున కలియుగ వైకుంఠం తిరుమలలో వైకంన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, సీఎం జగన్ కి మరింత శక్తిని ప్రసాదించాలని వారు అభిలషించారు. వీరి వెంట శ్రీనివాసుని దర్శించుకున్న వారిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ సిటిజన్ విభాగం నాయకులు కె వి వి కృష్ణారావు, జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.ఎల్.ఎన్. రాజు, కార్పొరేటర్ కం టు భుక్త తవిటి రాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాళ్ల సూరిబాబు , చిటెళ్ళ రాంబాబు తదితరులు ఉన్నారు.
next post