సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలోని గరిడేపల్లి మండలం పోనుగోడు గ్రామములో మూడో వార్డులో DMF నిధుల కింద వచ్చిన 10 లక్షల రూపాయలతో నూతన సిసి రోడ్డు నిర్మాణానికి గ్రామ సర్పంచ్ జోగు సరోజిని పిచ్చిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి చేయడానికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు.
అదేవిధంగా MLA శానంపూడి సైదిరెడ్డి అడుగు జాడల్లో పదవికాలం లోపు గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపెడతాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ – 2 మెళ్ళచెరువు వెంకటరమణ, ఉప సర్పంచ్ గండ్ర సైదిరెడ్డి, తెరాస మండల పార్టీ అధ్యక్షులు జోగు అరవింద్ రెడ్డి, రాం సైదులు, కటికం గోపయ్య, యల్లవుల వెంకన్న, చామకూరి అంజి, ఏపూరి వినోద్, యాకుభి సైదులు, అనంతు తరుణ్, మిడిసేనమెట్ల శ్రీను, అనంతు బుడయ్య, నేలపట్ల నాగయ్య, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.