రైతులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంకు ఖాతాలు స్తంభించిన రైతులకు రుణమాఫీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతుల ఖాతాలకు నిధుల విడుదల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. నిర్దేశిత సమయానికి రుణమాఫీ పూర్తి అవుతుందన్నారు.
ఇప్పటి వరకు 16.6లక్షల ఖాతాలకు రూ.8089.7 కోట్లు బదిలీ చేశామన్నారు. రుణమాఫీ విషయంలో రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు.