కడప జిల్లా నందలూరులో అటవీ ప్రాంతంలో ఉండవలసిన జంతువులు, పక్షులు గ్రామాల్లో ఆహారం,నీటి కోసం వస్తు న్నాయి. ముఖ్యంగా నెమళ్లు, జింకలు అధికంగా కనిపిస్తున్నాయి.
వర్షాలు లేక పోవడం అడవిలో నీరు, ఆహారం లేకపోవడంతో సమీప లంకమల అభయారణ్యం నుంచి ఇవి గ్రామాల్లో, పొలాల్లో దర్శనం ఇస్తున్నాయి.
కొన్ని జింకలు కుక్కల భారీన పడి గాయపడిన సంఘటనలు ఇటీవల జరిగాయి. అటవీశాఖ అధికారులు అటవీ ప్రాంతంలో నీటి కుంటలు, ఆహారం ఏర్పాటు చేస్తే ఇవీ జనాల మధ్యకురావని జంతు ప్రేమికులు భావిస్తున్నారు.