కనుపాపల తలచి,ఆత్మీయత పంచి,కుటుంబం కోసం అహర్నిశలు కష్టించే స్త్రీమూర్తిని స్మరించుకోవడం మనందరి బాధ్యత అని సర్వర్ ఫౌండేషన్ సభ్యులు అన్నారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని మహిళామణులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
సర్వర్ ఫౌండేషన్ వ్యస్థాపకులు, సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ ఆదేశాల మేరకు వెంకటాపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయితీలో పని చేస్తున్న సిబ్బందిని, పోలీసు స్టేషన్ లో మహిళ పోలీస్,జవహార్ నగర్ పిట్రోల్ బంకులో మహిళలను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
అనంతరం సర్వర్ ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదని,కుటుంబ భారాన్ని మోసి,సర్వం త్యాగం చేస్తున్న మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. మనందరినీ కంటిపాపలా చూసుకుంటూ,తల్లిలా లాలిస్తూ,అక్కలా తోడుంటూ,భార్యలా బాగోగులు చూస్తున్న మహిళామణులను సన్మానించుకోడం సంతోషంగా ఉందని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్వర్ ఫౌండేషన్ సభ్యులు మామిడి పెల్లి రమేష్, రాసమళ్ళ హేమంత్, చంటి అనిల్,బోల్లవెన రాజ్ కుమార్,అత్తిని శ్రీకాంత్,అశోక్, కాడపాక శ్యామ్,శేఖర్, బన్ని తదితరులు ఉన్నారు.