40.2 C
Hyderabad
April 29, 2024 15: 33 PM
Slider తూర్పుగోదావరి

పెట్రోలు బంకు యాజమాన్యం బెదిరింపులతో మహిళ ఆత్మహత్యాయత్నం

#kakinada

దొంగతనం నేరం మోపడమే కాకుండా తన కుటుంబాన్ని వేధిస్తున్న పెట్రోలు బంకు యాజమాన్యానికి నిరసనగా ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కాకినాడ జిల్లా లో ఈ ఘటన జరిగింది. కాకినాడ లోని డిమార్ట్ దగ్గర్లో ఉన్న పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న ఒక మహిళ పై యాజమాన్యం నగదు చోరీ ఆరోపణ చేసింది. పెట్రోల్ బంకు యాజమాన్యం బలవంతంగా ఆమెతో బాండ్ పేపర్లు పై సంతకం తీసుకున్నారు. డబ్బులు ఎప్పుడు కడతావని ఇంటికి వెళ్లి బెదిరించి భర్తను ఆమెను హతమారుస్తామని పెట్రోల్ బంక్ యాజమాన్యం బెదిరించింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. పైగా పెట్రోల్ బంకు యజమానులకు పోలీసులు కొమ్ముకాస్తున్నారు. ఇప్పటి వరకు బంక్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. దాంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం జిజిహెచ్ లో చికిత్స పొందుతూ ప్రాణాలతో కొట్టుమిడుతున్నది.

Related posts

వాడ వాడ లో మంత్రి పువ్వాడ

Murali Krishna

ఆడ‌వాళ్ల‌కు అభ‌య హ‌స్తం…దిశ యాప్…..!

Satyam NEWS

ఎన్ఎమ్ డిసి  హైదరాబాద్ మారథాన్‌లో సి బి ఐ టి విద్యార్థులు

Satyam NEWS

Leave a Comment