పల్నాడు జిల్లా నరసరావుపేట ఏపీఎస్ఆర్టీసీ డిపో గ్యారేజ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కేటగిరి లో పని చేస్తున్న మహిళలను సన్మానించి ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్ వి శ్రీనివాసరావు విచ్చేసి వారిని సన్మానించి వారి ప్రతిభను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో నరసరావుపేట డిపో మేనేజర్ బి వీరస్వామి, పిడుగురాళ్ళ డిపో మేనేజర్ ముక్తేశ్వర రావు మాట్లాడుతూ వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన మహిళలను ఆదర్శంగా తీసుకొని మరింత అభివృద్ధి పథంలో ఆర్టీసీని సంస్థను నడపాలని తెలియచేశారు. ఇదే కార్యక్రమంలో జిల్లా ఎకౌంట్ డిపార్ట్మెంట్ అధికారిణి ప్రమీలా రాణి పాల్గొన్నారు.