శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రునివలస గ్రామం లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా కేకును కట్ చేయడం జరిగింది.
అనంతరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రతినిధి గంగు వెంకటరమణమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం రాష్ట్ర ప్రజల అదృష్టమని ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని పేద ప్రజలకు, రైతులకు సంక్షేమ పథకాలు విద్యార్థులకు, అమ్మ ఒడి, విద్యదీవెన, ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టారని ఎల్లప్పుడూ ఈయనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఉండాలని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బాణాలగాంధీ, పల్లి వైకుంఠం కొల్లి జగన్నాథం, అప్పారావు, రమేష్ ,రమణ, కొయ్యాన జగదీశ్, రామారావు గ్రామ కార్యదర్శి తిరుమల దేవి, గ్రామ సమైక్య సంఘం అధ్యక్షురాలు బాలమ్మ , వి.వో ,లు కోడి లక్ష్మీ, హేమలత గంగు కొండయ్య సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.